మన్మథుడిగా ఆంధ్రా అమ్మాయిల మనసు దోచిన నాగార్జున మరో రెండు నెలలు కొత్త గెటప్ లో కనిపిస్తారు. షూటింగు కోసం ఆయన గెటప్లోకి రాలేదు. శ్రీవారి సేవలో భక్తిభావంతో వచ్చారు. శనివారం ఉదయం విరామ సమయంలో ఆయన కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని సందర్శించారు. దర్శనానికి ముందు స్వామివారికి ఆయన తలనీలాలు సమర్పించారు. తెల్లవారు ఝామునే 4-5 గంటల మధ్య వీపీ కోటాలో భార్య అమల, చిన్న కొడుకు అఖిల్ తో కలిసి ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. నాగార్జునను ఇదివరకెన్నడూ బోడిగుండుతో చూడని అభిమానులు….ఈ దృశ్యం చూసి ఆశ్యర్య పోయారు. నాగార్జున తల్లి అన్నపూర్ణ పది రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే.